ఆదిలాబాద్ : మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలును నిర్మల్ జిల్లాలో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీతో కలసి రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ వారితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు చేర్చాలని తెలిపారు. అలాగే రైస్ మిల్లర్లు లారీలను ఆపకుండా ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ సహాయంతో పూర్తి చేయాలని తెలిపారు.
ఖానాపూర్లో 60, భైంసాలో 60, నిర్మల్ లో 100 వెహికల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రోజు 250 వెహికల్స్ పనిచేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సెంటర్ ఏజెన్సీలకు తెలుపాలన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్, పి.రాంబాబు, సివిల్ సప్లై అధికారి కిరణ్ కుమార్, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపద వేళ ఎమ్మెల్యే సుమన్ ఆపన్న హస్తం
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు