నిజామాబాద్ : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బాల్కొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులతో నియోజకవర్గ సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు క్యాంప్ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనతో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయిస్తున్నారని మంత్రి వేముల వివరించారు.
నియోజకవర్గంలోని ప్రజలంతా ఎమ్మెల్యేలకు బిడ్డల్లాంటి వారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా క్యాంపు కార్యాలయం పరిష్కార కేంద్రంగా ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారులకు, ప్రజలకు అనుకూలంగా వుండే విధంగా ఎమ్మెల్యే అక్కడే బస చేసి అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని రూ. కోటి 90 లక్షలతో నిర్మాణం చేయనున్నట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద