మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వంగిరిజనులకు పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యా నాయక్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందన్నారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైస్ ఛాన్సలర్గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ