KA Paul | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ను తగులబెడదామంటూ ఒక టెర్రరిస్టులో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీతో మాట్లాడమని కేఏ పాల్ తెలిపారు. ప్రగతి భవన్ను తగులబెడదామని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. దేశంలో ఇంతకంటే తక్కువ తీవ్రత వ్యాఖ్యలు చేసిన వాళ్లనే అరెస్టు చేయడం మనం చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, మజ్లిస్ ఎమ్మెల్యే ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
నోటుకు కేసులో పట్టుబడి.. టీడీపీ నుంచి నిన్న కాక మొన్న కాంగ్రెస్లో చేరి.. చట్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్న వ్యక్తిని టీపీసీసీ చీఫ్ చేశారంటే.. మీ భారత్ జోడో యాత్రను ఎవరూ పట్టించుకోరని రాహుల్ గాంధీకి సూచించారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని కేఏ పాల్ ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు కన్నుసన్నల్లానే టీపీసీసీ చీఫ్గా పనిచేస్తున్నారని విమర్శించారు. భూ కబ్జాలు చేసి రేవంత్ రెడ్డి ఈ స్థాయికి ఎదిగాడని అన్నారు.
బీజేపీ అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసింది.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది..
దేశ పాలకులకు అమృత్కాలమైతే.. దేశ ప్రజలకు ఆపద కాలం : హరీశ్రావు