మనోహరాబాద్, జూలై 31: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మనోహరాబాద్ ఎస్సై సుభాష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మనోహరాబాద్ మండలం కూచారంతండాకు చెందిన మలావత్ శ్రీనివాస్(42) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంటల దిగుబడి రాకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో శ్రీనివాస్ గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రజిత, బాబు, పాప ఉన్నారు.
ఆర్ఎంపీ దారుణ హత్య
పెంట్లవెల్లి, జూలై 31 : ఆర్ఎంపీ హత్యకు గురైన ఘటన నాగకర్నూల్ జిల్లాలో జరిగింది. వివరాలు .. ఏపీలోని కర్నూల్ జిల్లా పగిడాల నుంచి మల్లయ్య (54) నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి వలస వచ్చాడు. ఆర్ఎంపీగా క్లినిక్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి న ఘటనలో అదే గ్రామానికి చెందిన కుటంబంతో తగాదా కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రి 8:15 గంటల ప్రాంతంలో క్లినిక్లో ఉండగా.. ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు వ్యక్తులు కలసి తమకు ఆరోగ్యం బాగాలేదంటూ వచ్చారు. మల్లయ్య పరీక్షించేందుకు రా గా.. వారు కారం పొడిని ఆర్ఎంపీ కండ్లల్లో చల్లారు. క్లినిక్ నుంచి అతడిని బయటకు తీసుకొచ్చి ప్రధాన రహదారిపైనే వేట కొడవళ్ల తో విచక్షణారహితంగా నరుకడంతో అక్కడికక్కడే మల్లయ్య ప్రా ణాలు విడిచాడు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని దవాఖానకు తరలించి.. విచారణ చేపట్టారు.