ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా లభించింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్లోని ఓ ఇంట్లో నిషేధిత గుట్కాలను నిలువచేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయని అధికారులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.47,440 ఉంటుందని వెల్లడించారు. విచారణ నిమిత్తం నిందితులను ఈస్గాం పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు చెప్పారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..