ఉట్నూర్, ఏప్రిల్ 19 : మండల కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో మేజర్ గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఈశో సత్యనారాయణ మాట్లాడుతూ.. పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు పిచికా రీ చేస్తున్నామన్నారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించా లని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది మనోహర్, సల్మాన్, నర్సయ్య, సుభాష్, కార్మికులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో..
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్లో ప్రత్యేక శానిటేషన్లో భాగంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పట్టణమంతా పిచికారీ చేయిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని వినాయక్చౌక్ నుంచి రసాయనాల పిచికారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో కరోనా పెరుగుతుండడంతో రెండు ప్రత్యేక వాహనాలతో పాటు మున్సిపల్ అదనపు కార్మికుల ద్వారా కాలనీల్లో సైతం రసాయనాలను పిచికారీ చేయిస్తున్నామన్నారు. ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.