Telangana | హైదరాబాద్ : తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీసీల నియమాక దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీగా వీసీగా కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యనందరావు, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీగా అల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డి నియామకం అయ్యారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్కు వెళ్దాం.. రేవంత్ రెడ్డికి హరీశ్ సవాల్
Harish Rao | గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు.. రేవంత్ రెడ్డికి హరీశ్రావు కౌంటర్