జయశంకర్ భూపాలపల్లి : రాజకీయ ఉనికి కోసమే ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అపహాస్యం చేస్తే ప్రజలలో చులకనవుతారని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలనే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎన్నికల కోసం ఏ పథకాన్ని ప్రవేశ పెట్ట లేదని ఆయన గుర్తు చేశారు. అలాగే ఏ పథకాన్ని కూడా అర్ధాంతరంగా నిలిపి వేయలేదనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గమనించాలన్నారు. రైతు
ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, చౌకబారు, అనాలోచితమైన విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలకు పెన్షన్ వర్తింపు అమలు చేయడం హర్షణీయమన్నారు. అనంతరం 27 మంది లబ్ధిదారులకు 10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్