న్యూఢిల్లీ/కాఠ్మండు, మార్చి 29: గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) దేశవ్యాప్తంగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. తాజా కేసుల్లో దాదాపు 84.5 శాతం కేసులు కేవలం 8 రాష్ర్టాల్లోనే వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 40,414, కర్ణాటక-3,082, పంజాబ్-2,870, మధ్యప్రదేశ్-2,276, గుజరాత్-2,270, కేరళ-2,216, తమిళనాడు-2,194, ఛత్తీస్గఢ్లో 2,153 కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడిన వారిలో తాజాగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,843కు చేరింది. మరోవైపు ద్వైపాక్షిక భాగస్వామ్యంలో భాగంగా నేపాల్ సైన్యానికి లక్ష డోసుల కరోనా వ్యాక్సిన్ను భారత సైన్యం అందజేసింది.
ఇవీ కూడా చదవండి..
ప్రగతి కోసం, బంగారు భవిత కోసం ఓటేయండి: ప్రియాంకాగాంధీ
బెంగాల్ ఎన్నికలు.. బీజేపీ కార్యకర్త హత్య