Loksabha Elections 2024 : రిజర్వేషన్లపై విపక్ష కూటమి కుయుక్తులను ఈరోజు ఇండియా కూటమిలో ఓ భాగస్వామ్య పార్టీ నేత బట్టబయలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని బీద్లో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
పశుగ్రాస కుంభకోణంలో దోషిగా తేలిన నేత రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేస్తూ విపక్ష ఇండియా కూటమి కుట్రను అంగీకరించారని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాల్సి ఉందని ఆయన అన్నారని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్తో ఏ ఒక్క జాతీయవాద శక్తి లేదని ప్రధాని చెప్పారు.
అసలైన ఎన్సీపీ, అసలైన బాల్ ఠాక్రే శివసేన బీజేపీతో ఉండగా నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేనలు కాంగ్రెస్తో జట్టుకట్టాయని ఎద్దేవా చేశారు. వీరంతా బూటకపు హామీలు ఇస్తూ నకిలీ వీడియోలు తయారుచేయడంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ తాను పనిచేయదు..పనిచేసేవారిని చేయనివ్వదని, ఇదే ఆ పార్టీ అలవాటని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
Read More :
Chandrababu Naidu | తగలబెట్టబోయి చేయి కాల్చుకున్న చంద్రబాబు.. వీడియో