కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పరిధిలోని కేశియారి ఏరియాలో బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని మంగల్ సోరెన్(35)గా పోలీసులు గుర్తించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పుర్బా మేదినిపూర్ జిల్లాలోని సత్సాతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బెంగాల్లో 30 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటలకు 28.13 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్లో తొలిదశ పోలింగ్ కోసం 7,061 పోలింగ్ స్టేషన్లు, 10,288 పోలింగ్ బూత్లు ఏర్పాటుచేశారు.