సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న నారింజ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతుంది. నారింజ ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం నిలువ 58 mcft కాగా, గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం మండలంలో కురుస్తున్న వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. గురువారం తెల్లవారుజాము నుంచి నారింజ ప్రాజెక్టు గేట్ల పై నుంచి వరద నీరు ప్రవహించడంతో కర్ణాటక వైపు నీరు వెళ్తుంది. చెరువులు, చెక్డ్యాంలు సైతం వరద నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం నారింజ ప్రాజెక్టు గేట్లు పై నుంచి 80 ఇంచులు ఎత్తులో నీరు ప్రవహిస్తుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం