IND vs ENG : ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన భారత జట్టు విజయంపై కన్నేసింది. సిరీస్ను సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ సేన టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. గత మ్యాచ్లో భారీగా పరుగులిచ్చిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ బెంచ్కే పరిమతయ్యాడు. అతడి స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ మాత్రం ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
టీమిండియా టీ20 కెప్టెన్గా తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న శ్రేయాస్ అయ్యర్కు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. అలానే అరంగేట్రంలో 14 పరుగులకే వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశీ శుభారంభంతో రెచ్చిపోవాలని భావిస్తున్నాడు. జాకబ్ బెథెల్ విధ్వంసంతో బోణీ కొట్టిన ఆతిథ్య జట్టు మరో విజయంతో సిరీస్లో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది.
Prince Yadav replaces Ravi Bishnoi as India opt to bowl first against England in Nottingham 🔀 pic.twitter.com/iGr8ud8ORH
— Cricinfo (@cricinfo) July 7, 2026
భారత తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, ఆదిల్ రషీద్, ఆర్చర్, జోష్ టంగ్.