సూర్యాపేట : ఆక్సిజన్కు ఎటువంటి కొరత లేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. 24 గంటలు నడిచే ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. రెమిడెసివర్ గురించి అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని ఆయన ప్రజలకు విజ్ణప్తి చేశారు.
కరోనా నివారణకు అదొక్కటే మందు కాదని, అదొక మందు మాత్రామేనన్నారు. కొవిడ్ పై అనుసరించాల్సిన విధి విధానం తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటింటా ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానం వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
అదే సమయంలో అనవసరంగా భయాందోళనకు గురి కావొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే