వనపర్తి : కరోనా బాధితులకు జిల్లాలోని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు. మదనాపురం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో కరోనా బారిన పడిన వారికి స్థానిక నేతల చేతుల మీదుగా డ్రైఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
రేపటి నుంచి టాటా కార్ల ధరలకు రెక్కలు