జనగాం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ఇక్బాల్ కుమారుడు సయ్యద్ రియాజ్ (19) మూడు రోజుల నుంచి కనపడకపోవడంతో గాలిస్తుండగా శుక్రవారం చెరువులో పడి మరణించినట్టు గుర్తించారు.
మృతుడికి ఈత రాకపోవడంతో చనిపోయాడని తెలియజేశారు. కాగా, మృతుడి తండ్రి గ్రామంలోని మసీదులో మొగుల్ సాహెబ్గా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోనదలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
రేపటి నుంచి టాటా కార్ల ధరలకు రెక్కలు