నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షిందన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖకు కవిత అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారని తెలిపారు.
మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదన్నారు. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ