యాదగిరిగుట్ట రూరల్, మార్చి 30 : వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఈ సంవత్సరం పూర్తి లాభాల్లో ఉన్నదని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపా రు. మంగళవారం వంగపల్లి పీఏసీఎస్లో సంఘం అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవ త్సరం సంఘం రూ. 24 లక్షలతో లాభం గడించిందని తెలిపా రు. ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువుల అమ్మకం, సం ఘం రుణాల రికవరీ సంఘం లాభాల్లోకి రావడానికి కారణమ న్నారు. సంఘం లాభాల్లో ప్రయాణించడం చాలా సంతోషకర మని ఇందులో తాను భాగస్వామిగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు పావల వడ్డీకే ఇచ్చే పంట రుణం పరిమి తి ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. సంఘం సీఈవో భద్రారెడ్డి వార్షిక నివేది క ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా అమోదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం తరుపున పెట్రోల్ బంక్ నడపాలని, ఎమ్మెఎస్సీ ఫోగ్రాం క్రింద గోదాం నిర్మాణం చేపట్టాలని, మో టకొండూరు గ్రామంలో మరొక గోదాం నిర్మించాలని, సం ఘంకు మూడు ఎకరాల స్థలం ప్రభుత్వం నుంచి కేటాయించా లని కలెక్టర్ను కోరుతూ తీర్మాణం చేసినట్లు తెలిపారు. సమా వేశంలో జడ్పీటీసీ అనురాధ, వంగపల్లి సర్పంచ్ కవిత, ఎంపీ టీసీ మౌనిక, పోశయ్య, ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు స్వామి, బ్యాంక్ వైస్ చైర్మన్ బాలయ్య, మల్లయ్య, వీరస్వామి, కృష్ణ, రమేశ్, ఉపేందర్, అనిత, భిక్షంగౌడ్ పాల్గొన్నారు.
ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన
తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నాడని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం వంగపల్లిలో లబ్ధిదారులై న ప్రశాంత్కుమార్కు రూ. 60వేలు, మురళికి రూ. 37, 500 వెంకట్రెడ్డికి రూ. 60 వేలు, సుధాకర్రెడ్డికి రూ. 40 వేలు, బీ రయ్యకు రూ.45వేలు, లగపతికి రూ. 37,500 మొత్తం ఆరు గురికి రూ.2.80 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన గడ్డం నర్సయ్య, అల్వాల ఎల్లమ్మలు ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మంగళవారం గ్రామంలోని మృతుల ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇవీ కూడా చదవండి..