నాగార్జునసాగర్ : ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన తెలంగాణలోని నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని..పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం బౌద్ధ నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో అభివృద్ధి పరచిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనం పరిసరాలలో వాకింగ్ ట్రాక్ను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో కృష్ణాతీరంలో నాలుగు చోట్ల, మధ్య రాతియుగపు సూక్ష్మ రాతి పనిముట్లు, కొత్త రాతియుగపు గొడ్డళ్లు , సాన దీసిన గుంటలు, ఒడిష రాళ్లు అరగదీసిన ఆనవాళ్లు చూశానని శివనాగిరెడ్డి తెలిపారు. గతంలో నాగార్జునకొండ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు బయటపడ్డాయని, ఈ కొత్త ఆనవాళ్ల ప్రకారం ఈ ప్రాంతం ఆదిమానవుల కార్యస్థావరంగా ఉండేదన్నారు.
నదీ తీరాన దగ్గరగా వేటకు వెళ్లి ఆహార సంపాదనకు అనువుగా ఉండేదని ఆయన తెలిపారు. కొత్త రాతియుగపు ఆనవాళ్లు ఉన్న వాకింగ్ ట్రాక్కు పైన ఆర్కలాజికల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చునని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, బుద్ధవనం ఎస్ఈ క్రాంతి బాబు, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యామ్ సుందర్ రావు, నరసింహారావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు