నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా ఉన్న సావెల్ ఆశ్రమంలో ఏడుగురు స్వామీజీలు నివాసముంటున్నారు. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో స్వామీజీలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆశ్రమానికి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురు స్వామీజీలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా స్వామీజీలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.