కరీంనగర్ : నాయీ బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట స్వర్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన నాయీ బ్రాహ్మణ, రజక నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అథిగా హాజరై మాట్లాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాయీ బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులు. అందుకే వీరికి సేవ చేస్తే సమాజానికి సేవ చేసినట్లేనని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తర్వాత పేదరికంలో ఉన్నది ఈ రెండు కులాలే అన్నారు. వీరు 90 శాతం కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తారని మంత్రి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వీరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర