కరీంనగర్ : పార్టీ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. జిల్లాలోని జూరాబాద్ పట్టణంలో జరుగుతున్న పార్టీ కార్యాలయ ఆధునీకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కార్యాలయాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దనున్నట్లు కెప్టెన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయం గోడలు పగుళ్లు చూపాయని, దీనిని పునరుద్దరించడంతో పాటు కార్యాలయాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు.
కార్యకర్తలతో ముచ్చటించేందుకు పెద్దహాలు, విలేకరుల సమావేశానికి అనువుగా ఉండేందుకు ప్రత్యేకమైన గదితోపాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
ఉద్యమాలకు అడ్డగా ఈ కార్యాలయం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందకు పార్టీ కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆయనవెంట నాయకులు గందె శ్రీనివాస్, బర్మావత్ యాదగిరినాయక్, కొలిపాక శ్రీనివాస్, తోట రాజేంద్రప్రసాద్, తొగరు సదానందం, ముక్క రమేశ్, రియాజ్, గందె సాయి పాకాల మధూకర్ రెడ్డి, బాబాఖాన్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ ఫంగస్తో బైంసాలో ఒకరి మృతి
ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్.. పట్టుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్