నల్లగొండ : అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని డీఐజీ రంగనాధ్ తెలిపారు. జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి వద్ద అంతర్ రా ష్ట్ర సరిహద్దును డీఐజీ పరిశీలించి చెక్ పోస్టు పోలీసులకు తగు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేదా ఎపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చే కొవిడ్, ఇతర రోగులు దవాఖానల నుంచి ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తామని పేర్కొన్నారు.
లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఉదయం 6.00 నుంచి 10.00 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామని డీఐజీ తెలిపారు.
ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలి.
సరిహద్దుల వద్ద ఈ పాస్ లేకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
సరిహద్దుల వద్ద ఈ పాస్, ఎలాంటి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలతో వాహనాల రద్దీ పెరిగిపోతున్నది.
అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించి అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ