జోగులాంబ గద్వాల : అత్తను అల్లుడు కర్రతో కొట్టి చంపిన విషాద సంఘటన అయిజ మండల పరిధిలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో చోటు చేసుకుంది. తెలుగు సాలమ్మ(40)ని ఆమె అల్లుడు దస్తగిరి హత్య చేసినట్లు శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి దస్తగిరి కర్రతో కొట్టడంతో చనిపోయినట్లు పేర్కొన్నారు. సాలమ్మకు ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు.
పెద్ద కూతురు వాణిని గత నాలుగు సంవత్సరాల క్రితం కర్నూలుకు చెందిన దస్తగిరికి ఇచ్చి వివాహం చేశారు. వాణికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సంవత్సర కాలం నుంచి దస్తగిరి వాణిని వేధిస్తుండడంతో వారం రోజుల క్రితం తల్లి సాలమ్మ కర్నూలుకు వెళ్లి తన కూతురు వాణితో పాటు వారి పిల్లలను తీసుకుని చిన్న తాండ్రపాడు గ్రామానికి వచ్చింది.
రాత్రి దస్తగిరి తన పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వస్తుండగా అత్త అడ్డురావడంతో కర్రతో బలంగా కొట్టడంతో చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి భర్త రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీఐ వెంకటేశ్వర్లుతో పాటు ఎస్సై జగదీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ