హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5 : హ్యూమన్ రైట్స్ప్రొటెక్షన్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ (హెచ్ఆర్పీడబ్ల్యూఏవో) రాష్ర్ట అధ్యక్షుడిగా, మీడియా విభాగం సీఈఓగా నవనీత్ జినుకలని నియమితులయ్యారు. సామాజికసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, నాయకత్వ లక్షణాలు, ప్రజలతో మమేకమై సేవ చేయాలనే సంకల్పాన్ని గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంస్థ పేర్కొంది.
ఈ సందర్భంగా నవనీత్ మాట్లాడుతూ సంస్థ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మానవ హక్కుల పరిరక్షణ, యువతకు అవగాహన కార్యక్రమాలు, మహిళా సాధికారత, పేద, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. త్వరలో రాష్ర్టస్థాయి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడంతో పాటు జిల్లాల వారీగా కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.