హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యపై ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం తన సతీమణి జానమ్మతో ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి-ముత్తగూడెం రహదారి మార్గంలో చిన్నచిన్న గుట్టలపై విత్తనాలు చల్లారు.
రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవల ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన సతీమణితో కలిసి విత్తనాలను వ్యాప్తి చేయడం ద్వారా తమలో స్ఫూర్తి నింపారు.. ఆరోగ్యం సహకరించకున్నా.. ఆయన మనసు మొక్కల పెంపకంవైపే లాగుతుంది.. రామయ్య హ్యాట్సాప్ అంటూ ఎంపీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
No introduction needed for Padmashree #VanajeeviRamaiah garu. He was unwell for few days and once he’s back to home, he’s off to what he is best at. Hats off Ramaiah garu for keeping us inspired by spreading seeds on the occasion of #WorldEnvironmentDay along with your wife. 🙏 pic.twitter.com/t0GJsVZP8g
— Santosh Kumar J (@MPsantoshtrs) June 6, 2022