హైదరాబాద్ : సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళల రక్షణ కోసం హైదరాబాద్ యువకులు రూపొందించిన ‘అభయ కోట్’ అనే ప్రత్యేక సేఫ్టీ జ్యాకెట్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..మహిళల భద్రత సీఎం కేసీఆర్ ప్రధాన ఎజెండా అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా షీ టీంలు ఏర్పాటు చేసామన్న కవిత, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందన్నారు. దివ్యాంగ మహిళల రక్షణ కోసం ప్రత్యేక పరికరాలను రూపొందించిన యువకులు దినేష్, శశాంక్ రెడ్డి, దినేష్ రెడ్డిలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
వీరు రూపొందించిన ఈ ప్రత్యేక కోట్ వినికిడి , మాట్లాడడం సమస్య ఉన్న మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎలాంటి సందర్భంలోనైనా ప్యానిక్ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే సైరన్ మూగడంతో పాటు, ఎలక్ట్రిక్ షాక్ కూడా వచ్చేలా ప్రత్యేక జాకెట్లో ఏర్పాట్లు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళల ఆత్మరక్షణకు, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఈ ప్రత్యేక జాకెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లొకేషన్ మెసేజ్ వెళ్లేందుకు సైతం ప్రత్యేక జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా