వరంగల్ : తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా అధ్యక్షుడు బండారు శ్రీధర్కు ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. ఆదివారం వరంగల్ నగరంలో శ్రీధర్ దశ దినకర్మ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..బండారు శ్రీధర్ అకాల మరణం జాగృతి కుటుంబానికి తీరని లోటు అన్నారు. దివంగత శ్రీధర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
Medaram | ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్రావు
చప్పట్లతో కరెంట్ మోటర్ ఆన్, ఆఫ్..నాగర్కర్నూల్ యువకుడి ప్రతిభ