హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ అయిన ఉస్మానియా విశ్వవిద్యాయం వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డీ. రవీందర్ యాదవ్ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘనంగా సన్మానించారు. గతంలో ఉస్మానియా పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. రవీందర్ సార్ వైస్ ఛాన్సలర్ హోదాలో యూనివర్సిటీ అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. వీసీల నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం వర్సిటీల వారీగా జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీగా డీ రవీందర్తోపాటు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి కే సీతారామారావు, శాతవాహన వర్సిటీ వీసీగా ఎస్ మల్లేశం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా సీహెచ్ గోపాల్రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, తెలంగాణ యూనివర్సిటీకి ఉపకులపతిగా డాక్టర్ డీ రవీందర్గుప్తా, జేఎన్ఏఎఫ్యూ వీసీగా కవిత దర్యాని, కాకతీయకు తాటికొండ రమేశ్, తెలుగు వర్సిటీ వైస్చాన్స్లర్గా కిషన్రావు, జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డిని నియమించింది. వీరంతా మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.