మహబూబాబాద్ : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని గూడూరు మండలం ఎర్రకుంట తండాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త బదావత్ మంగీలాల్ మంగళవారం మృతి చెందాడు.
అతడి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొని స్వయంగా పాడె మోశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఖాసీం, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం