హైదరాబాద్ : హయత్నగర్కు సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్లో దారుణం జరిగింది. తారామతిపేట్కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు పీకల దాకా మద్యం తాగించారు. మద్యం అతిగా సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు.
అనంతరం అతని భార్యపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి మట్టుబెట్టారు. సురేశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సురేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.