యాదాద్రి భువనగిరి : అదుపుతప్పి ఓ లారీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని తుర్కపల్లి మండలం జెతిరామ్ తండా మూల మలుపు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..మెడిసిన్లో వాడే జిప్సమ్ లోడ్తో ఓ లారీ గజ్వేల్ నుంచి భువనగిరి వైపుగా వెళ్తున్నది.
ఈ క్రమంలో జెతిరామ్ తండా మూల మలుపువద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే కాలువలోకి దూసుకెళ్లడంతో లారీలోంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయపడ్డారు.