హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సంతోష్ను మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు.
జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని, సుదీర్ఘ ప్రజా జీవితం వారికి దక్కాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఐటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు