పెద్దపల్లి : అనారోగ్యంతో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. జిల్లాలోని ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన సాక్షి విలేకరి కళ్లెం స్వామి రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు హన్మంత రెడ్డి తండ్రి చిన్న మల్లయ్య, కటికెనపల్లికి చెందిన టీఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షుడు చిగురు పోచయ్య అనారోగ్యం తో మరణించారు. కాగా, బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజ్రాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు