మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు కు అంగీకరించినందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
నర్సింగ్ కళాశాల మంజూరుతో జిల్లాలో ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందని, అంతేకాక చదువుకున్న విద్యార్థులకు కళాశాలలో పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నర్సింగ్ కళాశాల వల్ల దవాఖాన ఇంకా బాగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి