ములుగు : మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలలక్ష్మీ నర్సింహహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం కొవిడ్ నిబంధనల నడుమ నాగవెల్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22న అనుకురార్పణతో మొదలైన స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు గరుడాధివాసం, ధ్వజారోహణం, ఎదుర్కోలు, ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలను సంప్రదాయంగా నిర్వహించారు.
ఆదివారం ఉదయం సతీ సమేతంగా స్వామి వారికి సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, మండపారాధన, బాలబోగం, పంచామృతాభిషేకం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ చింతామణి జలధార వద్ద పెరుమాళ్లకు చక్ర స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకపూజల అనంతరం శాస్త్రోక్తంగా నాగవెల్లి తంతు నిర్వహించారు. సోమవారం నిర్వహించనున్న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రావనపు సత్యనారాయణ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు శ్రీ మురళీకృష్ణ మాచార్యుల బృందం, స్థానిక ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, రాజశేఖరశర్మ, పవన్ కుమార్ ఆచార్యులు, ఈశ్వర్ చందు శర్మ, సీనియర్ అసిస్టెంట్ సీతారాములు శేషు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకను