కొడకండ్ల/జనగామ : కరోనా బాధితులకు ప్రజా ప్రతినిధులు అండగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా బాధితులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా కట్టడిలో ఉందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో కొవిడ్ బాధితులను ప్రజాప్రతినిధులు ఆదుకోవాలన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలోని కొవిడ్ బాధితులతో టెలీ కాన్ఫెరెన్స్లో ప్రతి రోజు మాట్లాడుతున్నాని తెలిపారు.
కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటానని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!