హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, చికిత్స వసతులపై గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి సమీక్షించారు. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్స్ లో అన్ని వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు.
జిల్లాలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నివేదిక ఇవ్వాలని, ఏదైనా కొరత, ఇబ్బంది ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కొవిడ్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..