హైదరాబాద్ : మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారి సిద్దబోయిన సమ్మారావు(28) కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే ఆయన భార్య కూడా కరోనాతో మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మారావు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తల్లిదండ్రుల మరణంతో పిల్లల బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు