మహబూబాబాద్ : వరద ప్రవాహానికి వాగులో పడి చనిపోయిన తాటి రవి(26) మృతదేహానికి మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, జిల్లాలోని బయ్యారం, మెట్ల తిమ్మాపురం వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటి వెళ్తుండగా రవి వాగులో పడి చనిపోయిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ బిందు, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం