హైదరాబాద్ : పిల్లలకు ఆపద వస్తే ఆదుకునేందుకు ఉపయోగించే 1098 నంబర్ బాగా ప్రచారం అయ్యేలా.. ఒకేసారి 33 బాల రక్షక్ వాహనాలను ప్రారంభించినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి తెలిపారు. బాలలను ఆదుకునేందుకు 33 జిల్లాలకు ప్రత్యేకంగా జిల్లాకొకటి చొప్పున బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం కేటాయించింది.
ఇందులో భాగంగా ఆదివారం మంత్రి సత్యవతి మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి తెలిపారు.
గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనివ్వడం, జన్మనిచ్చిన తర్వాత వారికి ఆలనా, పాలన, ఎదుగుదలకు తోడ్పాటునందించడం, నాణ్యమైన విద్య, పోషకాహారం ఇవ్వడం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడడం, అనంతరం పెళ్లి అయ్యే వరకు అడుగడుగునా అనేక పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
రాష్ట్రంలో అనాథలు అనేవారు ఉండకూడదని వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పిల్లలకు ఆపద వస్తే ఆదుకునేందుకు ఉపయోగించే 1098 నంబర్ బాగా ప్రచారం అయ్యేలా ఒకేసారి 33 బాల రక్షక్ వాహనాలను విడుదల చేయాలని స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తూ.. మాకు మార్గనిర్దేశనం చేసి నడిపించిన మంత్రి కేటీఆర్కు ధన్యావాదాలు తెలిపారు.
అలాగే ఇందుకు సహకరించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మల్లారెడ్డి యూనివర్సిటీ, మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాట్కో ఫార్మా లిమిటెడ్, కన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పౌండేషన్, నిర్మాణ్ సంస్థ, ఐసీఐసీఐ ఫౌండేషన్, వారధి ఫౌండేషన్, సుమధుర ఫౌండేషన్, యశోదా ఫౌండేషన్, మిస్ ఇండియా మానస వారణాసి, డిఎంఎఫ్టి నాగర్ కర్నూలు, సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ సంస్థలన్నిటికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సంస్థలన్నీ ప్రభుత్వానికి అండగా ఉండడం నిజంగా మాకెంతో గర్వ కారణమని మంత్రి సత్యవతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime news | తెల్లారితే ఆ ఇంట్లో శుభాకార్యం..ఇంతలోనే తండ్రి మృతి
Khammam | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. వీడియో
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి