ఖమ్మం : ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ సంఘటన వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టీఎస్ ఆర్టీసీకి చెందిన మియాపూర్ డిపో బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
మియాపూర్ నుంచి భద్రాచలం వెళ్తున్న వోల్వో బస్సు వైరాకు చేరగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వైరా పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. కాగా, బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయపటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | తెల్లారితే ఆ ఇంట్లో శుభాకార్యం..ఇంతలోనే తండ్రి మృతి
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి