పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంథని మండలం బిట్టు పల్లి వద్ద టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి క్వారీలో ఇసుకను తీసుకు వెళ్లేందుకు టిప్పర్ వస్తున్నది. ఈ క్రమంలో వరి కోసేందుకు కాలినడకన వెళ్తున్న బిట్టుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి గట్టయ్య(50), ధర్ముల రాజమల్లు(52) పైకి టిప్పర్ దూసుకెళ్లింది.
ఈ ఘటనలో గట్టయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. రాజమల్లు మంథని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా తుది శ్వాస విడిచాడు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మిట్టపల్లి గ్రామ ప్రజలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Hebba Patel | సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్లో హెబ్బా పటేల్..