ఖమ్మం : పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను మంత్రి పువ్వాడ సమక్షంలో పోలీస్ సిబ్బందితో నాటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించాలని, హరిత ఖమ్మంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ట్రైనీ ఐపీఎస్ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ బోస్, ఏసీపీలు ఆంజనేయులు, రామోజీ రమేష్, సీఐలు, సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
రౌడీ బేబి వీడియో సాంగ్ సెన్సేషనల్ రికార్డు