యాదాద్రి భువనగిరి : యాదాద్రి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈవో గీత కు అందజేశారు. తొలి విడతలో అక్టోబర్ 28న మూడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లు విరాళం అందజేశారు.
ఇప్పటివరకు 10 కిలోల బంగారానికి గానూ మొత్తం రూ.4.93 కోట్లు ఈవో గీతారెడ్డికి మంత్రి అప్పగించారు. మేడ్చల్ నియోజక వర్గం తరఫున మొత్తం 11 కేజీల బంగారం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో మరో కేజీకి సంబంధించిన విరాళాలు ఆలయ అధికారులకు అందజేయ నున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
ఢిల్లీలో త్రీవస్థాయిలో వాయుకాలుష్యం