KTR | హైదరాబాద్ : తెలంగాణలో బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్న పోకిరీకి స్కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పడం నిజంగా దురదృష్టకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బెదిరింపు ఘటనలను సీరియస్గా తీసుకుని, చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రి మహముద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ను కేటీఆర్ కోరారు. ఈ ట్వీట్కు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ను కేటీఆర్ షేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులమని చెప్పుకుంటూ కొంత మంది వ్యక్తులు తన మొబైల్కు నిన్న అర్ధరాత్రి 12:15 గంటలకు పదేపదే కాల్స్ చేశారని దాసోజు శ్రవణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అసభ్య పదజాలంతో బెదిరించారని తెలిపారు. దీంతో సైబర్ క్రైమ్, సంబంధిత పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
ఈ బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపి దోషులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తాను అని శ్రవణ్ చెప్పారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండడం దురదృష్టకరం.
గతంలో కూడా తన అనుచరుల ద్వారా వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి తదితర సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన ఆయన ఇలాంటి వ్యూహాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు అని శ్రవణ్ గుర్తు చేశారు.
ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడకుండా తనను అడ్డుకోలేవని రేవంత్ తెలుసుకోవాలి. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీలో ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు, సహిస్తున్నారు? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
I request Home Minister @mahmoodalibrs Garu and @TelanganaDGP Garu to kindly take this matter seriously and act sternly and swiftly as per law
It’s truly unfortunate that Scamgress now has been handed over to a thug in Telangana who is resorting to open threats https://t.co/qJWN0sS5Lw
— KTR (@KTRBRS) July 14, 2023