నల్లగొండ : నల్లగొండ(Nallagonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి(Lightning) ఓ యువకుడు మృతి(Died) చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన త్రిపురారం మండలం నీలాయగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. క్రికెట్(Cricket) ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం పడటంతో అందరూ చెట్టు కిందకు వెళ్లడంతో పిడుగుపడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.