హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎన్పీఏ((పనికిరాని ఆస్తి- నాన్ పర్ఫార్మింగ్ అసెట్) గవర్నమెంట్లో భారతదేశ ఎకానమీని నాశనమైందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏండ్లలో అత్యధికంగా నిరుద్యోగ రేటు పెంచారని మండిపడ్డారు. అలాంటి వారు తెలంగాణకు వచ్చి మాకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణ వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నామని కేటీఆర్ తెలిపారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై స్టడీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని కేటీఆర్ సూచించారు.
Amazed at the audacity of NPA Govt & its chieftains who’ve destroyed economy, led us to highest unemployment in 45 years, highest inflation in 30 years & highest LPG rate in the world!
Have been a colossal failure for India/Telangana; yet come & lecture us on administration 🤦
— KTR (@KTRTRS) May 6, 2022