హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించడాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో యోగికి ఓటు వేయకపోతే యూపీ వదిలి పారిపోవాల్సి వస్తుందని బెదిరించడం సరికాదన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీలో మరో అద్భుతమైన హాస్యనటుడు బయటపడ్డారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతకంటే దిగజారుడుతనం ఉండదన్నారు. బీజేపీకి ఓటు వేయకపోతే మీ ఇంటిని యోగి బుల్డోజర్లతో కూల్చేస్తారు అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో ఉండాలంటే యోగిని గెలిపించాలి. లేదా యూపీని వదిలి పారిపోవాల్సి వస్తుందని రాజాసింగ్ బెదిరించారు.
Just when you think they can’t stoop any lower, yet another amazing comedian pops up 😆
If you don’t vote for BJP, Yogi will demolish/Bulldoze your house says this BJP MLA/Legislature floor leader from Telangana !! https://t.co/YkiCsnETn7
— KTR (@KTRTRS) February 16, 2022